24, సెప్టెంబర్ 2010, శుక్రవారం

గణేశా!రక్షించు కాలుష్యం బారి నుంచి...

అంతా ప్రశాంతంగా ముగిసింది. పిన్న,పెద్ద తేడా లేకుండా వర్షం లెక్క చేయకుండా గణేష్ నిమజ్జనంలో పాల్గొన్నారు.వేలకొలది విగ్రహాలు నీట మునిగాయి.ఇప్పటి హుస్సేన్ సాగర్ చూస్తె ఒక రకమైన ఆవేదన కలుగుతోంది.కొన్ని విగ్రహాలు నిస్సహాయంగా నీటిలో తేలుతున్నాయి.నీటిలో కరగలేక మరికొన్ని కొట్టుకు వస్తున్నాయి.టన్నులకొద్దీ చెత్త.వస్తూనే ఉంది.రోడ్లపై అడ్డంగా వేసిన పందిళ్ళు ఇంకాతీయలేదు.వాహనదారులు విసుక్కుంటూ వెళ్తున్నారు.భక్తీ పేరిట ఇంత హంగామా అవసరమా?చిన్న చిన్న మట్టి విగ్రహాలు,రకరకాల ఆకులతో పూజిస్తే దేవుడికీ,మనకూ ఎంత మంచిదో కదా!ఆ విషయం వీర భక్తులకు చెప్పేదెవరు?ప్రభుత్వానికీ ఎంత ఖర్చు?పోలీసు ఏర్పాట్లకు,క్రేన్లకు ఎంతెంత ఖర్చు?అదంతా అలా ఉంచితే హుస్సేన్ సాగర్లో పేరుకున్న కాలుష్యం ఎవరు తొలగించగలరు?దేవుడా?నువ్వే రక్షించాలి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి