19, జులై 2010, సోమవారం

ఎవరికోసం?

హాయ్, హలో ,గుడ్ మార్నింగ్! కాని ఇవాళ చాల కోపంగా,బాధగా ఉంది.అసలు పిల్లలకు చదువులు వస్తాయా అని బెంగగా ఉంది.లేకపోతె ఏమిటి?ఎక్కడో బాబ్లిపైన గొడవ అయితే ఇక్కడ స్కూల్స్ మూసేస్తే , ఏమొస్తుంది? ఇంగితం అనేది రాను రాను తగ్గిపోతోంది.మా ఫ్రెండ్ చెప్పింది చాలా మంది వాళ్ళ పిల్లల్ని వేరే రాష్ట్రాల్లో చేర్పిస్తున్నారట చదువుల కోసం.అంతేకాదు.ఆందోళనలు చేసేవాళ్ళ పిల్లలు హాయిగా వేరే ఊళ్లలో చదువుకుంటున్నారట. పాపం,ఏ పాపం ఎరుగని అమాయక జీవుల పిల్లలు,పెద్దలు ఈ బంధుల మూలంగా నష్టపోతున్నారు.మొన్నటికి మొన్న పరీక్షలలో ఎన్ని శలవులు?దానివల్ల ఎందరో నష్టపోయారు.ఇవన్ని చూసి మా అక్క కొడుకుని చెన్నై లో చేర్పించారు.మొత్తమ్మీద పక్కవాడు బాగు పడుతున్నాడు.మన రాష్ట్రం నష్టపోతోంది. అసలు ఈ రాజకీయ వాదులను ఎక్కడన్నా వదిలేయాలి.లేకపోతె, వెళ్లి మహారాష్ట్రలో బందు చేయడమో, నిరాహారదీక్ష లాంటివి చేయాలిగాని ఇక్కడ ఏమి చేస్తే మాత్రం ఏం లాభం?కేవలం,కుటిల రాజకీయాలతో, ప్రచారం కోసం చేసే గిమ్మిక్కులతో ఇబ్బందుల పాలయ్యేది సామాన్య ప్రజలే.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి